Sunday, October 6, 2024
HomeదైవంSrisailam: మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్లపైమాటే

Srisailam: మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్లపైమాటే

బంగారు, వెండి కూడా ..

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైలం దేవస్థానానికి 3,17,50,290/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో (14.09.2023 నుండి 11.10.2023 వరకు) సమర్పించారు. అలాగే ఈ హుండీలో 187 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 340 గ్రాముల వెండి లభించాయి.

- Advertisement -


243 యుఎస్ఎస్ఐ డాలర్లు 450- ఆస్ట్రేలియా డాలర్లు, 40 కెనడా డాలర్లు, 15 – యూఏఈ దిర్హమ్స్, 6- సింగపూర్ డాలర్లు, 5 – యూరోప్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News