Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Sangareddy: దామోదర్ రాజనరసింహ కుమార్తె గొప్ప మనసు

Sangareddy: దామోదర్ రాజనరసింహ కుమార్తె గొప్ప మనసు

పేద బాధితురాలికి ఆర్థిక సాయం అందజేత

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష ఒక నిరుపేద బాధితురాలు ఓదార్చి, ఆదుకుంది. త్రిష నిన్న రాత్రి బూత్కూర్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి హోం న్యూరో హాస్పిటల్ లో సెట్ ను సందర్శించి వస్తుండగా, పక్కన ఉన్న జహీరాబాద్ మొగుడంపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ కన్నీరు పెట్టుకొని తన కూతురును కాపాడాలని బోరున విలపించింది. తాను తెచ్చుకున్న డబ్బులు సరిపోలేవాని నా కూతురుకు ఇంకా వైద్యం చేయించలేనని త్రిషమ్మకు వివరించింది. సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులైన రాజనరసింహ కుమార్తె అయిన త్రిష ఈ సందర్భంగా బాధితురాలు బాధని అర్థం చేసుకొని వెంటనే కాదనకుండా ఆర్థిక సహాయం అందించారు. 25,000/-రూ వేల ఆర్థిక సహాయం చేసి, మీకు ఏమి అవసరం ఉన్న నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటాయని ఆమె బాధ్యతలని ఓదార్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News