Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శ్రీశైల క్షేత్రపాలకుడికి అమావాస్య ప్రత్యేక పూజలు

Srisailam: శ్రీశైల క్షేత్రపాలకుడికి అమావాస్య ప్రత్యేక పూజలు

పలు సమస్యలు విరగడ చేసే వీరభద్రుడు

అమావాస్య సందర్భంగా శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి ఈ సాయంకాలం విశేషార్చన జరిపించబడుతోంది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు. పరోక్షసేవ ద్వారా 36 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అలాగే ఆస్ట్రేలియా నుండి కూడా ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాధికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను చేస్తారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం నిర్వహించబడుతుంది.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News