Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట విషాదం

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట విషాదం

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి థెరీసమ్మ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన థెరీసమ్మ.. ఎందరో విద్యార్థులను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యాసంస్థలకు ఆమె ఛైర్ పర్సన్ గా ఉన్నారు.

- Advertisement -

థెరీసమ్మ మరణంతో మంత్రి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జార్జి గ్రీన్స్ నందు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి మాతృమూర్తి మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News