Thursday, October 3, 2024
Homeపాలిటిక్స్Congress shocked: గద్వాల కాంగ్రెస్ కు షాక్

Congress shocked: గద్వాల కాంగ్రెస్ కు షాక్

భారీ ఎత్తున బీఆర్ఎస్ లోకి చేరికలు

గద్వాల్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది. వారితోపాటు మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ:

- Advertisement -

కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని సీఎం కెసిఆర్ గారితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.

జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేసి అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్లో ముఠా సంస్కృతులను వ్యతిరేకిస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపుకు కృషి చేస్తాం అన్నారు.

మంత్రి హరీష్ రావు కామెంట్స్:

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది. ముఖ్యంగా గద్వాలలో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే. గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింది. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. గద్వాల్ లో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకుందాం.గద్వాల్ అభివృద్ధిని కొనసాగిద్దాం. కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పాటు పడతాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటుంది.

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఉంది. కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి ఎవరు గ్యారెంటీ అని ప్రజలు అడుగుతున్నారు.

అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి, హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్యారెంటీ. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పిన చెప్పని హామీలు అన్ని నెరవేర్చి తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించుకుందాం.

గద్వాల కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారి వివరాలు:

పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బంగి ప్రియాంక MIM కౌన్సిలర్,
బంగి సుదర్శన్ ఎమ్ ఎమ్ టౌన్ ప్రెసిడెంట్, రఘు నాయుడు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్ ధరూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్వనాథ్ రెడ్డి కేటి దొడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉమాదేవి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎక్స్ జడ్పిటిసి, పూల కర్ణాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, అల్క్జాండర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News