Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుపతి పర్యటనలో గవర్నర్

Tirumala: తిరుపతి పర్యటనలో గవర్నర్

రెండు రోజుల తిరుమల టూర్లో..

రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్. పి పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్.పి. కులశేఖర్ , ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, డిప్యూటి కలెక్టర్ లు భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, రేణిగుంట తహసిల్దార్ ఉదయ సంతోష్, డి ఎస్ పి భవ్య , స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను రెవెన్యూ , పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.

- Advertisement -

అనంతరం రాష్ట్ర గవర్నర్ రోడ్డు మార్గాన తిరుమల బయలుదేరి వెళ్ళారు. నేటి రాత్రి తిరుమలలో బస చేసి, ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మద్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని బెంగళూరు వెళ్లనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News