Wednesday, October 2, 2024
HomeతెలంగాణBichkunda: జన నేతకు అడుగడుగునా జన నీరాజనం

Bichkunda: జన నేతకు అడుగడుగునా జన నీరాజనం

ప్రచారంలో దూసుకుపోతున్న షిండే

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హన్మంత్ షిండే తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని బిచ్కుంద మండలం లోని గోపన్పల్లి గ్రామం నుండి ప్రారంభించారు. ముందుగా కీ. శే నాల్చర్ శ్రీహరి సమాధి వద్ద నివాళులు అర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు.

- Advertisement -

అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి గోపన్పల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుండి ఎన్నికల ప్రచార పర్వాన్ని ఘనంగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిసారి తనకు ఎంతో కలిసి వచ్చే గోపంపల్లి గ్రామం నుండి ప్రచార పర్వం మొదలు పెట్టడం ఆనందంగా ఉందని, ప్రతి ఎన్నికలకు తనను ఆశీర్వదించిన గ్రామస్థులకు సిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమం గోపంపల్లి, హాస్గుల్, శెట్లూర్, ఖతగావ్, గుండెకల్లూరు, కల్లాలి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, సొసైటీ చైర్మన్ బాలు (బాలాజీ ), మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు శ్రీహరి , మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, మల్లికార్జున్ పటేల్, యువ నాయకుడు హరీష్ షిండే, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News