Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న గవర్నర్

Tirumala: శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న గవర్నర్

ముగిసిన గవర్నర్ తిరుమల టూర్

ఈ ఉదయం తిరుమల రచన అతిథి గృహం నుండి కుటుంబ సమేతంగా బయలుదేరి శ్రీవారి ఆలయం చేరుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఎ.వి ధర్మారెడ్డి స్వాగతం పలకగా శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలకగా ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో గవర్నర్ వారికి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ గవర్నర్ కి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు. అనంతరం గవర్నర్ మధ్యాహ్నం 12.15 కి రేణిగుంట విమానాశ్రయం బయల్దేరి వెళ్లారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వీరి వెంట టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News