Thursday, October 3, 2024
HomeతెలంగాణNelakondapalli: పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

Nelakondapalli: పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

నేలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ నేతలు పలువురి రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అసంతృప్తులంతా ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆ పార్టీలోని కొందరి నేతల అధిపత్య పోరు తమకు ఇబ్బందికరంగా ఉందని చెబుతూ… ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన వారంతా పొంగులేటి శీనన్న వెంటే ఉంటామంటూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలానికి చెందిన మాజీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు తేజావత్ కోటేశ్వరరావు, వార్డు మెంబర్ భూక్య భారతి, ధీరావత్ శ్యామాలి, రాజారాం పేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధీరావత్ బాలాజీ, గోబ్రియా, యూత్ నాయకులు వీరన్న, వంశీ తదితరులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News