Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhira: మధిర అభివృద్ధి మల్లుభట్టి విక్రమార్క తోనే సాధ్యం

Madhira: మధిర అభివృద్ధి మల్లుభట్టి విక్రమార్క తోనే సాధ్యం

ఆకట్టుకుంటున్న మల్లు విక్రమాదిత్య

మధిర అభివృద్ధి మల్లు భట్టి విక్రమార్క తోనే సాధ్యమని శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లు విక్రమాదిత్య అన్నారు. మధిర నియోజకవర్గంలో శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క తరపున ప్రచారం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క తనయుడు మల్లు విక్రమాదిత్య ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో మా తండ్రి చేసిన శంకుస్థాపనలను ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ నాయకులు నిధులు తీసుకొచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు దీనిని గ్రహించి అనునిత్యం ప్రజల కోసం కష్టపడే వారికి మీ అమూల్యమైన ఓటు వేయాలని మధిర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మల్లు భట్టి విక్రమార్క కు ఓట్లు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి రంగారావు కోణాద్రి కుమార్ షన్ను నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News