Saturday, April 12, 2025
HomeతెలంగాణMulugu: జడ్పి కో-ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Mulugu: జడ్పి కో-ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

రేవంత్ రెడ్డి సమక్షంలో..

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ములుగు జడ్పీ కో- ఆప్షన్ సభ్యులు రియాజ్ మీర్జా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాదులో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పిఆహ్వానించారు. ఆయనతో పాటు వార్డు సభ్యులు అజ్మీర అజయ్ నాయక్, ఎండి. వలీ పాషా, వజ్జల కుమార్ యాదవ్, లావుడ్యా రమేష్, గందె రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నద్దునూరి రమేష్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి కుతుబుద్దిన్, ఎస్.సి.సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బోడ రఘు, ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓంప్రకాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News