Sunday, October 6, 2024
HomeతెలంగాణVanasthalipuram: దేవిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లోకి వలసలు

Vanasthalipuram: దేవిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లోకి వలసలు

ఎల్బీ నగర్ లో గులాబీ జోరు

వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్య నగర్ కాలనీలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఎల్బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి సమక్షంలో దాదాపు 140 మంది బారాస పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సుధీర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుంచి గోపాల్, యాదయ్య, కన్నా, స్వరూప, కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణమాచారి, లక్ష్మన్, నర్సింగ్ రావు, సురేష్ తదితరులు మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. రాబోయే రోజుల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యయంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేశామన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా.రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్త, మధు గౌడ్, బస్తి వాసులు సుమన్, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, సత్తి, హనుమంత్, సంజీవ, అందాలు, నిర్మల, రేవతి, బస్తీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News