Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Moinabad: కారుకు ఓటు వేస్తే కష్టాలు తప్పవు

Moinabad: కారుకు ఓటు వేస్తే కష్టాలు తప్పవు

కాంగ్రెస్ లో చేరిన పలు పార్టీల నాయకులు

కారు గుర్తుకు ఓటేస్తే కష్టాలు తప్పవని రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరతు అన్నారు. మండల పరిధిలోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన వాటి ప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి అమ్డాపూర్ గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాటి ప్రసాదొడ్డి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అందుకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం సాబాద్ దర్శన్, భీమ్భరతలు మాట్లాడుతూ మండల పరిధిలోని ముర్తుజాగూడ, నదీమ్ నగర్, కాశింబౌలి, అమాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణయ్య, జిల్లా మత్సకార్మిక సంఘం అధ్యక్షులు మహేందర్ ముదిరాజ్, అమ్డాపూర్ కాంగ్రెస్ నాయకులు మంగళ అంతయ్య, గొల్ల అంతయ్య, చాకలి శ్రీశైలం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News