Friday, September 20, 2024
HomeతెలంగాణDevireddy Sudhir Reddy: కలిసిన స్నేహం, గెలుపు ఖాయం

Devireddy Sudhir Reddy: కలిసిన స్నేహం, గెలుపు ఖాయం

సుధీర్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపిన రామ్మోహన్ గౌడ్

ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముద్దగోని రామ్మోహన్ గౌడ్ నివాసానికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి గాను రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తప్పకుండా మా మద్దతు సుధీర్ రెడ్డికి ఉంటుందని తెలిపారు. గతంలో చిన్న, చిన్న పొరపాట్లు వల్ల మేము విడిపోయామన్నారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి పొరపచ్చలు లేవని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మా సత్తా చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ చేరిక వల్ల మా బలం ఎంతో రెట్టింపు అయిందన్నారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మూడు నియోజకవర్గాలుగా అవుతుందని అప్పుడు రామ్మోహన్ గౌడ్ కుటుంబానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News