Friday, September 20, 2024
HomeతెలంగాణKavvampalli: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా

Kavvampalli: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా

కాంగ్రెస్ లో చేరికల పర్వం

బెజ్జంకి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరగా వారిని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా తనను గెలిపిస్తే శక్తి వంచన లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు ఎగోళ్ల అంజయ్య, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు తాటిచెట్టి రాజయ్య, బోనగిరి తిరుపతి, న్యాయవాది లింగాల ధన్ రాజు, నీలం మధుకర్ రెడ్డి, ముక్కిస రమణారెడ్డి, వీరారెడ్డి, అనుమాస రాజిరెడ్డి, శ్రీహరి, విష్ణు, సురేష్, రమేష్, మల్లేశం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News