నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో అఖిల భారతీయ మహిళా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నారీ శక్తి సమ్మేళనం నిర్వహించారు. భారతీయ మహిళ ఆది నుండి శక్తి రూపమే కానీ ఆమె ఏనాడూ అబల కాదని సహేతుకంగా తెలియజేస్తు ఈ సమ్మేళనాలను నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/4ee63506-63b8-48a5-bfa1-591fcabbbba7-1024x461.jpg)
ఈ సందర్భంగా డాక్టర్ సత్యసుందరి, డాక్టర్ స్వర్ణలత, న్యాయవాది విజయభారతి మాట్లాడుతూ భారతీయ మహిళ విధుషీమణి, వీరాంగన, ఉత్తమ గృహిణి, ఆమె మూలంగానే ఈ నాటికీ భారతీయ సంస్కృతి నిలిచిందని అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/833103d3-5f3c-4f68-9ee6-4d60717c3d89-1024x461.jpg)
విదేశీయ దాడులు, వికృతాలు ఆమెకు వ్యక్తిగకంగా, సామాజికంగా ఎదగకుండా అణచివేసిందన్నారు. భారతదేశం ఆన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందంజ వేయాలని, అందులో మహిళలు మాతృమూర్తి, ప్రొఫెషనల్ గా, శాస్త్రవేత్తగా, సామాజిక కార్యకర్తగా విధులను పోషించడం చాలా అవసరం అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/b30fee6b-5032-48ce-90b4-c126323c65f1-1024x461.jpg)
ఈ కార్యక్రమంలో మధుకుమారి, మురళి కళ్యాణి, శైలజ, సంధ్య, గాయత్రి, జ్యోతి చిలుకూరి, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/a6ce5e0d-d62d-4721-8606-9b816ace60c4-1024x461.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/64180765-4f01-4105-b82c-30c86b60e11f-1024x461.jpg)