Sunday, October 6, 2024
HomeతెలంగాణShadnagar: ప్రచారంలో దూసుకుపోతున్న ఏనుగు

Shadnagar: ప్రచారంలో దూసుకుపోతున్న ఏనుగు

వాళ్లవి మద్యం-డబ్బు రాజకీయాలు, మావి ప్రజా రాజకీయాలు

బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపుల ప్రశాంత్ ముదిరాజ్.. తన తల్లిదండ్రులు, గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఇంటింటికి బిఎస్పి ప్రచారాన్ని ప్రారంభించారు. లక్ష్మీదేవి పల్లి, వెంకిర్యాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పుతో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు బిత్తిరిత్తి పోవాలని కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలు మద్యం డబ్బుతో ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెడుతూ ప్రజా వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని, ప్రలోభాలకు గురి కావద్దన్నారు. ఆ పార్టీలు మద్యం డబ్బులతో రాజకీయాలు చేస్తుంటే బిఎస్పి మాత్రం ప్రజల కోసం రాజకీయాలు చేస్తుందన్నారు.

- Advertisement -

ధర్మనాయక్ తండా మీదుగా సంజీవపురం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, నేరుగా వెంకిర్యాల తండా మీదుగా వెంకిర్యాల గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఆగిర్యాలకు బయలు దేరారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు స్టార్ కాంపైనర్ దొడ్డి శ్రీనివాస్, కోశాధికారి గోపని భీమయ్య, షాద్ నగర్ నియోజకవర్గం ఎగ్జిక్యూటివ్ నెంబర్ దోమ హరికుమార్, ఫరూక్నగర్ కొందూరు కేశంపేట మండల అధ్యక్షులు తుప్పరి కుమార్ ధుర్గని శ్రీనివాస్ సొంటె శ్రీనివాస్, అధ్యక్షులు, కార్యకర్తలు, బీవీఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News