Friday, September 20, 2024
HomeతెలంగాణKandala: మీరే మా ఎమ్మెల్యే అంటున్న ప్రజలు

Kandala: మీరే మా ఎమ్మెల్యే అంటున్న ప్రజలు

పాలేరు ప్రఛార హోరుతో జోరు పెంచిన కందాళ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలేరు బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి తన ప్రచారంతో జోరు పెంచి, కారులా దూసుకుపోతున్నారు. మండలంలోని ప్రతీ గ్రామము తిరుగుతూ, తను చేసిన అభివృద్ధి, వ్యక్తిగత సహాయంను గుర్తుచేస్తూ, మీ పాలేరు బిడ్డనైన నన్ను గెలిపించి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా సదాశివపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రచారాన్ని నిర్వహించారు.

- Advertisement -

పాలేరులో దళితులు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ అందరికి ఒకేసారి దళిత బంధు అమలు చేయాలని కెసిఆర్ ని కోరగానే , “వొచ్చేది మన ప్రభుత్వం..కచ్చితంగా ఇద్దాం “అని హామీ ఇచ్చారని, ఆ విషయం మీ అందరికీ తెలుసు అని అన్నారు. మీ ప్రతీ కుటుంబానికి నేను చేసిన మంచేమిటో మీ అందరికి తెలుసు అని, నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో, కారు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటువేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని గెలిచేది నేనే, మళ్లీ మన సీఎం కేసిఆర్ యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, దళిత సంఘ రాష్ట్ర నాయకులు యాతాకుల భాస్కర్, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News