Saturday, October 5, 2024
HomeతెలంగాణPonnam filed nomination: పొన్నం నామినేషన్ దాఖలు

Ponnam filed nomination: పొన్నం నామినేషన్ దాఖలు

అన్ని విధాలా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నామినేషన్ ఘట్టం అట్టహాసంగా జరిగింది. మొదటగా పొన్నం దంపతులు పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో, హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుస్నాబాద్ లోని అనభేరి విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజక వర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి నామినేషన్ దాఖలు అందజేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, హుస్నాబాద్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

- Advertisement -


గౌరవెల్లి ప్రాజెక్ట్ విషయంలో మాటిమాటికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడిందని ఆరోపణలు చేసే బిఆర్ఎస్, నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గం గత పాలకులైన దేశిని చిన మల్లయ్య, చాడ వెంకటరెడ్డి, ప్రవీణ్ రెడ్డి ల హయాం లోనే నని ఈ పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు వివిధ గ్రామ శాఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News