Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: పురంధేశ్వరికి గజమాలతో సత్కారం

Kurnool: పురంధేశ్వరికి గజమాలతో సత్కారం

బిజెపి యువ నాయకులు శ్రీరాములు యాదవ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ పార్టీ నాయకులు టి. శ్రీరాములు యాదవ్ గజమాలతో ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ సర్కిల్ లో గజమాలతో శ్రీరాములు యాదవ్ సన్మానించారు. ఆమెతో పాటు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవ సిన్ హా చౌహాన్ వారిని కూడా శాలువా కప్పి సన్మానించారు. శ్రీరాములు యాదవ్ ఇటీవలే బిజెపిలో చేరారు. బిజెపి జిందాబాద్, నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్లాలి అని కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు నీలకంఠ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేష్, కర్నూలు పార్టీ జిల్లా ఇంఛార్జి అంకాల్ రెడ్డి, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్, ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య యాదవ్, బిజెపి అభిమానులు, తిక్కన్న, పుల్లన్న, రంగస్వామి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాములు యాదవ్ గత 15 సంత్సరాలుగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి, బిసి సంఘాల్లో ముఖ్య నాయకులుగా పని చేస్తున్న విషయం విదితమే. జిల్లాలో బిజెపి బలోపేతం కోసం పనిచేస్తానని, బడుగు, బలహీన వర్గాల సంక్షమం కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News