Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భవిష్యత్తుకు గ్యారెంటీలో భూమా అఖిల

Allagadda: భవిష్యత్తుకు గ్యారెంటీలో భూమా అఖిల

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ?

ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామంలో భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. నల్లగట్ల గ్రామంలో మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటింటికి వెళ్లి టిడిపి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించి నేటి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని వివరిస్తూ ..రాబోయే 2024లో టిడిపిని ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు. ఆళ్లగడ్డ పట్టణంలో జరిగిన బస్సు యాత్ర కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకేనని ఆమె అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి చెందలేదన్నారు. కేవలం ఉనికిని చాటుకునేందుకే బస్సు యాత్ర చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరూ అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలి అంటే మీరందరూ గెలిపించాలన్నారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించారు. టిడిపి కౌన్సిలర్ హుస్సేన్ భాష, టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News