Friday, September 20, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: అల్లాపూర్ లో పలు కాలనీ అసోసియేషన్స్ తో ఎమ్మెల్యే

Madhavaram Krishna Rao: అల్లాపూర్ లో పలు కాలనీ అసోసియేషన్స్ తో ఎమ్మెల్యే

మరింత అభివృద్ధిని కొనసాగిద్దామన్న ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సభియ గౌసుద్దీన్ తో అల్లాపూర్ డివిజన్లోని పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు, ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ ఒకప్పుడు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మౌలిక సదుపాయాలు వంటివి లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అద్దాలు లాంటి రోడ్లను ప్రతి గల్లీ గల్లీకి నిర్మించుకున్నామని.. ఇంటింటికి మంచినీరు ..24 గంటలు విద్యుత్ తో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు.

- Advertisement -

ప్రధానంగా రామారావు నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న నాలా సమస్యకు పరిష్కారం చూపామని.. అలాగే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కైతలాపూర్ ఫ్లైఓవర్ ద్వారా మరియు ప్రతి చోటా సిసి రోడ్లు బీటీ రోడ్లతో ట్రాఫిక్ సమస్యని అరికట్టామని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కానీ బిజెపి కానీ ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే పార్టీలో చేతుల్లో పెట్టి ఆగం చేసుకోవద్దని ..కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇందుకు నిదర్శనమే పదేళ్ల కాలంలో జరిగిన విప్లవాత్మక మార్పులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ..తిరిగి కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News