Friday, September 20, 2024
HomeతెలంగాణYennam: మీలో ఒకడిగా, మీకు అండగా ఉంటా

Yennam: మీలో ఒకడిగా, మీకు అండగా ఉంటా

సమస్యలను పరిష్కరిస్తానని హామీ

మీలో ఒకడిగా, మీకు అండగా ఉంటానని మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా పని చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని షాషాబ్ గుట్ట తాండ, షాషాబ్ గుట్ట, జగదాంబ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అందులో భాగంగా పలువురు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి వారి సమస్యల్ని వివరించారు. సిసి రోడ్డు లేక, మోరీల నీరు బయటికి రావడంతో దుర్గంధం వస్తోందని, ఎన్నిసార్లు పిర్యాదు చేసినా అధికారులు, నాయకులు స్పందించిన పాపాన పోలేదని, చిన్న వర్షానికే వీధుల్లో నీరు నిలువ ఉంటుంది అని పలువురు మహిళలు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలియజేస్తూ వాపోయారు.

- Advertisement -

పలువురు యెన్నం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాకు పదేళ్లగా డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, పెరిగిన ఖర్చులతో జీవనం సాగించడం కష్టంతరం అవుతుంది అని, రేషన్ కార్డులు రాలేదని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా యెన్నం వారికి భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మదీనా మజీద్ కౌన్సిలర్ మోయిన్ అలి, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్, మాజీ జెడ్పీటీసీ కె.శేఖర్ నాయక్, శేఖర్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు అవేజ్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు సలాం అహ్మద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఖాద్రీ, మాజీ పట్టణ అధ్యక్షుడు కిషన్ నాయక్, రామకృష్ణ నాయక్, జగదీష్, లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News