Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Sathupalli: జన సందోహంతో మట్టా దంపతుల నామినేషన్

Sathupalli: జన సందోహంతో మట్టా దంపతుల నామినేషన్

ఇక్కడే పుట్టి, పెరిగాం..ఇక్కడే ఉంటాం

సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తొలి మహిళా అభ్యర్థినిగా, సిపిఐ బలపరిచిన, తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆసిస్సులతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సతీమణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులతో కలిసి భారీ ఊరేగింపు నడుమ సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్దనిగా నామినేషన్ వేశారు… మట్టా దంపతుల నామినేషన్ కార్య్రమానికి పట్టణం మొత్తం పాదయాత్రగా తరలి వెళ్లారు.

- Advertisement -

డాక్టర్ మట్టా దంపతులు మాట్లాడుతూ ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉంటాము, స్థానిక బిడ్డగా ఆదరించండి, భారీ మెజారిటీతో గెలిపించండి… మా కుటుంబాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా టికెట్ ఇచ్చినందుకు జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మట్టా దంపతులు ధన్యవాదములు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మహిళలు, యువత పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News