Sunday, October 6, 2024
HomeతెలంగాణStation Ghanpur: నామినేషన్ వేసిన కడియం

Station Ghanpur: నామినేషన్ వేసిన కడియం

కలసి నడచిన ఎమ్మెల్యే రాజయ్య

అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ కార్యకర్తలు అభిమానులు స్థానిక ఆర్డివో కార్యాలయం భారీగా తరలివచ్చారు. అనంతరం ప్రజల ఉద్దేశించి అయన మాట్లాడుతూ ప్రజాదరణ మరువలేనిది అని అన్నారు. కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు కావాలి అంటే ప్రజలు కారు పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన కూతురు కడియం కావ్య, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News