Saturday, April 19, 2025
HomeతెలంగాణSuryapet: నామినేషన్ దాఖలు చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Suryapet: నామినేషన్ దాఖలు చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట పట్టణాన్ని, దోమల పట్టణంగా మంత్రి జగదీశ్ రెడ్డి మార్చాడని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని చూస్తున్నారనీ తెలిపారు.
ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. కనీస రహదారులు లేని సమయంలో రోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. ఇంకా ఆయన వెంట, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పోలగాని బాలు, కక్కిరేని శ్రీనివాస్, చంచల శ్రీనివాస్, డీకే తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News