Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Eetala nomination: హుజూరాబాద్ లో ఈటల నామినేషన్

Eetala nomination: హుజూరాబాద్ లో ఈటల నామినేషన్

భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈటల రాజేందర్, ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్. నామినేషన్ తర్వాత ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు, అనంతరం ప్రజలను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఒకరు వ్యాపారం చేసిన పైసలు, ఇంకొకరు దోచుకున్న పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు.
కాలేశ్వరం నుంచి తీసుకొస్తున్న పైసలు పంచి పెడుతున్నారు. కులసంఘాల భవనాలకు పైసలు ఇస్తే తీసుకోండి, పెద్దమ్మగుళ్ళకు, ఎల్లమ్మగుళ్ళకు, పోచమ్మగుళ్ళకు, బీరన్న గుళ్ళకు పైసలిస్తే తీసుకోండి. రోడ్లకి ఇచ్చిన ప్రొసీడింగ్ అన్నీ అమలు చేయాలని ప్రశ్నించండి అని అన్నారు. తెలంగాణ జాతి ఆత్మను అమ్ముకోదు, ఆత్మగౌరవంతో బ్రతికే జాతి. దాని ప్రతీకలు మా యువకులు. ఓటు అడుక్కునేది కాదు, కొనుక్కునేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు.
ఎన్నిసార్లు అయినా వేయవచ్చు.  నాకు ఏడుసార్లు వేశారు. 2008లో, 2010లో.. రెండుసార్లు తెలంగాణ ఆత్మగౌరవ బావుట కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపించారు. కెసిఆర్ బి ఫొం ఇచ్చినా పట్టుమని పది సీట్లు గెలవని విషయం మర్చిపోవద్దన్నారు. ఈటల రాజేందర్ వేలవేల తల్లుల ప్రేమతో పెరిగినవాడని, ఆకలిని దుఃఖాన్ని చవిచూసిన బిడ్డడని అన్నారు. ఈ 20 ఏళ్లలో ఎవరి దగ్గరైన నేను డబ్బులు తీసుకొన్నా  అని నిరూపించగలరా అని ప్రశ్నించారు.
సఫాయి కార్మికులు కూడా నా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటారు. ప్రతి ఒక్కరిలో నాకు మనిషి కనిపిస్తారు. హుజూరాబాద్ ప్రజల కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీసేలా పనిచేశా. మచ్చ తేకుండా పని చేశా. ఎక్కడికి పోయినా మీకు గౌరవం తెచ్చిన బిడ్డను నేను. హుజూరాబాద్ పేరు చెపితే మంచినీళ్ళు పుట్టేలా గౌరవం తీసుకువచ్చ అని అన్నారు.
✳️నాకొడుకు ఎవరో మీకు తెలుసా.. ?
నా బిడ్డ ఎవరో మీకు తెలుసా.. ?
నేను ప్రజలకోసం నిబద్దతతో పని చేస్తున్నా..
కుటుంబం కోసం కాదు.
మీ మీద ప్రేమలేక నేను గజ్వేల్ పోలేదు. నరకం చూపించిన కెసిఆర్ ను కొట్టేందుకు పోతున్నా. భూ లోకంలోనే నాకు కెసిఆర్ నరకం చూపిస్తే కాపాడుకున్న బిడ్డలు మీరు. మీకు ఓట్లు వేసి మళ్లీ మీ గడిల ముందు చెప్పులు పట్టుకుని పోవాలా..? మనుకోటలో మా మీద బుల్లెట్లు కురిపించిన, మా రక్తాన్ని కళ్ళ చూసిన.. వాడి పేరును అమరవీరుల స్థూపం మీద కొట్టించారు. మేము పెట్టిన స్థూపం తీసివేయించారు.
✳️కొంగుంచాపితే, డాన్సులు వేస్తే, ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ప్రజలు ఓట్లు వేస్తారా.
ప్రజలకు నచ్చాలి. సేవ చేయాలి. హుజూరాబాద్ లో  నాతో ఉన్నవారిని స్టేషన్లో పెట్టి కొట్టి ఫోటోలు తీసి పంపే పోలీసులు పోవాలంటే కెసిఆర్ ఓడిపోవాలి. ప్రధాన మంత్రి ఒక మాట చెప్పారు. కెసిఆర్ తో నువ్వు మాత్రమే కొట్లాడగలవు అని చెప్పారు. ఒక బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 36 కులాల పెద్దలలో మోదీ మాట్లాడారు. రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటారు. మా సత్తా ఏంటో చూపిస్తాం.
✳️నా కంటికి కెసిఆర్ దుర్మార్గం మాత్రమే కనిపిస్తుంది….
హుజూరాబాద్ ప్రజలారా ఇంటింటికీ వంద రూపాయలు ఇవ్వండి. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలు.
ప్రాణబిక్ష పెట్టిన వాళ్ళు కూడా నన్ను ఓడగొట్టలని పని కట్టుకొని తిరుగుతున్నారట.. మీరేం మనుషులు. మానవత్వం లేదా..?
✳️హుజూరాబాద్ కీర్తి ప్రతాక మరో సారి ఎగురబోతుంది…..
జమునమ్మను మీకు అప్పజెప్తున్న.
ఏ ఇంటికి ఆ ఇల్లు మీరే పోటీచేస్తున్నట్టు పని చేయండి. కెసిఆర్ నన్ను బయటికి పంపించి వీడి పని అయిపోయింది అనుకున్నాడు.. పని అయిపోయింది కెసిఆర్ ది. ప్రధానిమంత్రి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బాధ్యత అప్పగించారు.
ముఖ్యమంత్రి కావాలంటే ఒక్క దగ్గర గెలిస్తే సరిపోదు. తెలంగాణ అంతా తిరగాలి.
ఒక్క దీపం వెయ్యి దీపాలు వెలిగించినట్లు మీరు పని చెయ్యాలి.
ఆపద వస్తె మీకు అండగా ఉంటాను.
ముఖ్యమంత్రి చేయాలంటే కసితో, కమిట్మెంట్ తో పని చేయండి. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి.
మోదీ సంపూర్ణ అండ ఉంది అని అన్నారు.
✳️ఈటల జమున మాట్లాడుతూ..
ఉప ఎన్నికల్లో ఎంత కసిగా కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు ఉన్నారో..  ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.
ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉన్నాము మీరు బాధపడనవసరం లేదని ప్రజలందరూ చెబుతున్నారు.
2023 వరకు 7 సార్లు గెలిపించారు..  ఈటల రాజేందర్ మీ అన్న.
8వ సారి ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక.
తెలంగాణలో హుజూరాబాద్ నెంబర్ వన్ ఉండేలాగా ఆశీర్వదించాలని మీ అందరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News