Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: పురంధేశ్వరిని కలిసిన మండల కన్వీనర్

Vijayawada: పురంధేశ్వరిని కలిసిన మండల కన్వీనర్

పార్టీ బలోపేతం కోసం పక్కా ప్లాన్

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరుని అలహరి మండలం బిజెపి మండల కన్వీనర్ బసవరాజు విజయవాడలో కలిశారు. ఆమెకు సన్మానం చేసి పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు బిజెపి మండల కన్వీనర్ బసవరాజు తెలిపారు. అలహరి మండలంలోని రైతుల పరిస్థితి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరికి తెలిపామన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె తమకు తెలిపినట్లు బసవరాజు విలేఖరులకు తెలిపారు. త్వరలోనే ఆలహరి మండలంలోని పర్యటించి అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News