Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుAttack on Pujari: అర్చకులపై దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి

Attack on Pujari: అర్చకులపై దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి

చర్యలు తీసుకోకుంటే ఆందోళనలే

అర్చకులపై దాడులను ఆపాలని కర్నూలు లో జంగమ సంక్షేమ సంఘం, బ్రాహ్మణ సంఘల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలులోని కోట వీరభద్ర స్వామి దేవాలయం అర్చకుడు చంద్రమౌళిని దేవాలయం పక్కన నివాసం ఉంటున్న ఓ వ్యక్తి దాడి చేశారని దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. ఈ దాడిలో అర్చకుడికి కన్ను దెబ్బతినిదని వారు తెలిపారు. ఈఘటనపై జంగమ సంక్షేమం నాయకులు ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగమ సంక్షేమ సంఘం నాయకులు లాల్ బహాదుర్ శాస్త్రి, విశ్వేశ్వరయ్య, గంగాధర్ శాస్త్రి, కోటేశ్వరరావు, చంద్రశేకరయ్య, బసవరాజు, బ్రాహ్మణ సంఘం నాయకులు మనోహార్ రావు, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News