Sunday, October 6, 2024
HomeతెలంగాణShock to BRS: బిఆర్ఎస్ కి షాక్

Shock to BRS: బిఆర్ఎస్ కి షాక్

కాంగ్రెస్ గూటికి మంత్రి మహేందర్ రెడ్డి అనుచరులు

బిఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది, మంత్రి మహీందర్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బషీరాబాద్ , యలాల్, తాండూరు మండలం ముఖ్య నేతలు ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వీరికి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే బషీరాబాద్ మండలంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో వెళ్లడానికి కారణాలు ఏంటి అని పలువురు నోటా ప్రశ్నగా మారింది. చేరికల వెనుక ఎవరు ఉన్నారు ? మంత్రి మహేందర్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ లో వెళ్ళడానికి కారణం ఏంటి .. మంత్రి మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీపీలు, పిఏసీఎస్, చైర్మన్ లు , వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు పార్టీ మారడానికి వెనుక నుండి ప్రోత్సాహం చేస్తున్నారా… ఎవరు ఉండి చేయిస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి తీరుతో పార్టీ మారారా అన్నది మరో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News