Saturday, October 5, 2024
HomeతెలంగాణManakonduru: భారీ ర్యాలీగా కవ్వంపల్లి నామినేషన్

Manakonduru: భారీ ర్యాలీగా కవ్వంపల్లి నామినేషన్

డీజే సౌండ్స్ మధ్య ర్యాలీ

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వు) అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా డా.కవ్వంపల్లి సత్యనారాయణ అయిదుగురు సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలోని చెరువు కట్ట వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాలు, నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కవ్వంపల్లికి మద్దతు పలుకుతూ డప్పు-చప్పుళ్లు, డిజె సౌండ్స్, కోలాటాలు, ఆట పాటలతో భారీ ర్యాలీగా బయలుదేరి ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణా రెడ్డి, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి, తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ అధ్య క్షులు మోరపల్లి రమణారెడ్డి, గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా, సీనియర్ నాయకులు ఎలుకపల్లి సంపత్, ఎస్.ఎల్ గౌడ్, గోగురి నరసింహా రెడ్డి, శ్రీగిరి రంగారావు, ధనమనేని సురేందర్రావు, బుడిగ కొండయ్య, గవ్వ రాజేందర్ రెడ్డి, పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి గూడ కమలాకర్, అన్నారం గ్రామ శాఖ అధ్యక్షులు బందెల మహేందర్,మాషం రామకృష్ణ తిమ్మాపూర్ మండల కోఆర్డినేటర్ ఎం ఎ సమ్మద్, దుర్గ ప్రసాద్ దైవల శ్రీకాంత్, ఈగ సాయి, అంకుస్ లతో పాటు జిల్లా, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News