శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న శంకర్ పల్లి మున్సిపల్ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ రాములు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య కుటుంబ పాలనపై విరక్తి చెంది ప్రజలలో చైతన్యం కలిగిందని, కెసిఆర్ నియంతృత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/7bd49c01-d0af-43f7-bcff-4ed128b8163c.jpg)
తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/6e84d6d2-0858-4e54-8c6d-9c6ece025a53-1024x683.jpg)
ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనరల్ సెక్రెటరీ యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, స్టేట్ టీపిసిసి ఉపాధ్యక్షుడు ఉదయ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ర. లచ్చి రెడ్డి, పి. మాధవరెడ్డి, బాల కృష్ణారెడ్డి ధర్మారెడ్డి, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/11/3d4b433d-d653-44a1-b228-36a79f9d3266-1024x446.jpg)