Saturday, October 5, 2024
HomeతెలంగాణIbrahimpatnam: బీజేపీ భారీగా బంజారాలు

Ibrahimpatnam: బీజేపీ భారీగా బంజారాలు

మంచాలం మండలం బోడకొండకు చెందిన 140 మంది దేవారామ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ నివాసంలో బిజెపిలో చేరారు. దయానంద్ గౌడ్ వారందరికీ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -


అనంతరం దేవారామ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బంజారాల కోసం చేసింది ఏమి లేదని, కనీసం పట్టించుకున్నపాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బంజారాలను ప్రలోభపెట్టి ఓటు బ్యాంకుగానే చూసిందని, ఈ రెండు పార్టీలను నమ్మే కాలం పోయిందని అన్నారు. బిజెపి అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలను గుండెకు హత్తుకుందని, మా పిల్లల జీవితాలు బాగుపడాలంటే, వారి భవిష్యత్ గొప్పగా ఉండాలంటే బీజేపీ తప్ప వేరే ప్రత్యామ్యాయం లేదని, నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తుందని, అందుకే బీజేపీలో చేరామన్నారు. అనంతరం బంజారాలు మాట్లాడుతూ.. ఇక్కడ బడుగు బలహీనవర్గాల ముద్దుబిడ్డ నోముల దయానంద్ గౌడ్ అన్నకు టికెట్ ఇవ్వడంతోనే మేము ఎలాగైనా గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నామన్నారు. తప్పకుండా ఇబ్రహీంపట్నంలో వచ్చేది బిజెపినే అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది పరమేశ్వర, హాథిరామ్, రమేష్, నవీన్, నగేష్, ప్రవీణ్, ఫరెంగ, లక్ష్మీ, గాయత్రి, అచ్చలి, బుజ్జి, గోపాల్, ఫుల్ సింగ్, క్రాంతి, గాంధీ, రవి, రాజు నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News