Friday, September 20, 2024
HomeతెలంగాణLB Nagar: బిఆర్ఎస్ లో చేరిన బస్తీ వాసులు

LB Nagar: బిఆర్ఎస్ లో చేరిన బస్తీ వాసులు

గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన సుధీరెడ్డి

లింగోజిగూడ డివిజన్ మాజీ అధ్యక్షులు తిలక్ రావు ఆధ్వర్యంలో హరిజన బస్తీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి BRS లోకి పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రమేష్, రమణ, రాంలింగం, జగదీష్, యశ్వంత్, హేమంత్, శ్రీనివాస్, ప్రమోద్ మాట్లాడుతూ సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదన్నారు. ఇతర పార్టీల వారి మాటలు నమ్మి మోసపోవొద్దు అని తెలిపారు. సంక్షేమం,అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల రాజశేఖర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త మధుసాగర్, నాయకులు ఆడాల రమేష్, సత్యంగౌడ్, టీంకు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News