Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Revanth: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం

Revanth: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా?

దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించబోతున్న ఈ ఎన్నికల్లో ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగరవేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమం కోసం కాదు తెలంగాణ రాష్ట్ర పౌరుషానికి దోపిడీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన

- Advertisement -

పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి స్వయంగా ముత్తిరెడ్డి పట్టణ చౌరస్తాలో అర్ద నగ్న ప్రదర్శన చేశారని, పసుపు కుంకుమ కింద చెల్లేకు ఇచ్చిన ఆస్తులు దోచిన వ్యక్తి పల్లా అని, జనగామ పొలిమెరలో కాలు పెట్టనీయద్దని స్వయంగా ముత్తిరెడ్డి చెప్పాడని, ముత్తిరెడ్డి బాగోతం పల్లాకు తెలుసని, పల్లా భాగోతం ముత్తిరెడ్డికి తెలుసు. ఇద్దరి బాగోతం కేసీఆర్కు తెలుసని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆదేశాలతో 6 గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. సభలో రేవంత్ మాట్లాడుతుండగా సీఎం….సీఎం ..అంటూ అభిమానులు రేవంత్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రేవంత్ రాకతో జనగామ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నిపారనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాయితీగా పనిచేస్తా మీకు అండగా ఉంటా గెలిపించండి అన్నారు. జిల్లా సాధనలో ఉన్న ఉద్యమ నాయకుడిగా మీ ముందుకు వస్తున్నా, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News