Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Khammam: ఖమ్మంలో బిఆర్ఎస్ కి భారీ షాక్

Khammam: ఖమ్మంలో బిఆర్ఎస్ కి భారీ షాక్

తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా వలసలు

ఖమ్మంలో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఖమ్మం 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మి, మందడపు మనోహర్ , బిఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడపు మనోహర్ మాట్లాడుతూ.. తోటి కార్పొరేటర్ తిట్టరాని తిట్లు తిట్టడం వల్లనే మనోవేదనకు గురై మనసుకు నచ్చింది చేశానన్నారు. నిస్వార్ధంగా ప్రజల కొరకై పనిచేశాను కాబట్టి ప్రజలు నన్ను మరోసారి ఆదరించారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, పట్టణ అధ్యక్షులు జావిద్, సాదు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, ముస్తఫా, ఆశ్రిఫ్, పాషా, శేషగిరి, దొడ్డ నగేష్,ఆనంద్,జగన్ తో తోపాటు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News