బీ ఆర్ యస్, కాంగ్రెస్ పార్టీ లను నమ్మవద్దని..ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, చిట్టాపూర్, సాతారం, గుండంపల్లి, వి వి రావు పేట, రేగుంట గ్రామాల్లో కార్నర్ మీటింగ్ లలో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అరవింద్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చక్కర ఫ్యాక్టరీని ప్రారంబిస్తామని, పసుపు బోర్డుతో రైతులకు మేలు జరగనుందని, బి ఆర్ యస్, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు అని, వారిని ప్రజలు నమ్మేలా లేరని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని, ఇక్కడి ప్రజలకు జీవనోపాధి వస్తుందని బీజేపీకి అవకాశం ఇచ్చే బాధ్యత మీపై ఉందని అన్నారు.
Dharmapuri Arvind @ Mallapur: వాళ్లను నమ్మద్దు
చక్కెర ఫ్యాక్టరీని స్టార్ట్ చేద్దాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES