Saturday, October 5, 2024
HomeతెలంగాణVirlapalli Sankar: ఆరు గ్యారంటీలు పేదలకు వెలుగులు

Virlapalli Sankar: ఆరు గ్యారంటీలు పేదలకు వెలుగులు

భారీ గజమాలలతో స్వాగతం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డిగూడెం, తూర్పు గడ్డ, ఇప్పలపల్లి గ్రామాలలో భారీ గజమాలలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అంటూ నినాదాలతో పోరెత్తించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలుపరుస్తామని భరోసా కల్పించారు.ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి పొందారని వెల్లడించారు.కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తుందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే నియోజకవర్గం రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్, ఇబ్రహీం, గిరిజన వాసులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News