Saturday, October 5, 2024
HomeతెలంగాణJukkal: స్పీడు పెంచిన షిండే

Jukkal: స్పీడు పెంచిన షిండే

లోకల్ అభ్యర్థులే దొరకలేదా ?

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పలు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పెద్ద ఎక్లారా గ్రామంలో హన్మంత్ షిండేకు గ్రామస్తులు ఘనంగా భాజాభజంత్రిలతో స్వాగతం పలికారు. హన్మంత్ షిండే మాట్లాడుతూ నేను మీ బిడ్డనని లోకల్ వాడినని ఇక్కడే పుట్టి ఇక్కడే మీ మధ్యే పెరిగినవాడినని ఆశీర్వదించాలని అన్నారు. ఎన్నికలు రాగానే వేరే పార్టీ నాయకులు కూడా గ్రామాలకు వస్తారని వారి మాటలు నమ్మవద్దని అభివృద్ధిని చూసి ఓటు వెయ్యాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా లోకల్ అభ్యర్థులు దొరకక ఒకరేమో నిజామాబాద్, ఒకరేమో సంగారెడ్డి నుండి అభ్యర్థులను తెచ్చుకున్నారని అయన ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అయన గ్రామస్థులను కోరారు.

- Advertisement -

బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు నాగనాథ్ దేశాయ్ ని బిఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం అయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, కెసిఆర్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని అందుకే బీజేపీ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరానని అన్నారు.


ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ పండితరావు పటేల్, మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆశోక్ అప్ప, యువనాకులు ప్రదీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News