Saturday, September 21, 2024
HomeతెలంగాణGellu Srinivas: చిదంబరం వాస్తవాలను ఒప్పుకున్నారు

Gellu Srinivas: చిదంబరం వాస్తవాలను ఒప్పుకున్నారు

ఈాటలకు డిపాజిట్ కూడా దక్కదు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలంగాణ బలిదానాలకు తామే కారణమని వాస్తవాలు ఒప్పుకున్నారని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరం చేసిన వాఖ్యలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… నాడు లాబీయింగ్ కు తలొగ్గి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెనక్కి తీసుకోవడంతోనే యువత బలిదానాలు చేసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందని చూపే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్న వాళ్ళలో అందరూ నిరుద్యోగులు కాదన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
నిరుద్యోగులు అందరూ బిఆరెస్ వైపే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ తమ ఎజెండా చెప్పాలి కానీ వ్యతిరేక ప్రచారం చేయవద్దని హితువు పలికారు. ఈటల రాజేందర్ కి గజ్వెల్, హుజురాబాద్ లలో డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. బీజేపీ బీసీ సీఎం నినాదం నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ కి హుజురాబాద్ లో స్థానం లేదన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News