Saturday, September 21, 2024
Homeపాలిటిక్స్Annamalai campaigning for Kuna Srisailam Goud: హైదరాబాద్ లోని తమిళ ఓటర్ల వద్దకు అన్నామలై

Annamalai campaigning for Kuna Srisailam Goud: హైదరాబాద్ లోని తమిళ ఓటర్ల వద్దకు అన్నామలై

చింతల్ లోని తమిళ బస్తీలో ప్రచారం

కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నా మలై చింతల్ 128 డివిజన్లోని తమిళ బస్తీలో ప్రచారం చేపట్టారు. తమిళ బస్తీలో తమిళుల తోటి ప్రత్యేక సమావేశమైన ఆయన ఈ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు ఓటేసి గెలిపించాలని వారిని కోరారు. అనంతరం రంగారెడ్డి నగర్ డివిజన్లోని గాంధీనగర్ నందానగర్ మారుతీ నగర్ విజయనగర్ కాలనీలో బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలంతో కలిసి ప్రచారం చేపట్టారు.
అన్నామలై మాట్లాడుతూ, దేశాన్ని రక్షించాలన్నా, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలన్నా, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించాలన్నా అది బిజెపితోనే సాధ్యమని అన్నారు. బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించే వ్యక్తి అని, అందుకే ఆయనకు మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నానని అన్నారు. ఆయనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

- Advertisement -

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలను, బిజెపి మాత్రమే ప్రజలందరి పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కెసిఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అవుతారని, బిజెపి గెలిస్తే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జనసేన నియోజకవర్గం కన్వీనర్ సతీష్, అధ్యక్షులు పరిష వేణు పత్తి సతీష్ నాయకులు మోత శ్రీనివాస్ యాదవ్ , శేఖర్, రమేష్ మంజూల్కర్ బీజెపి సీనియర్ నేతలు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News