Saturday, April 19, 2025
HomeతెలంగాణSerilingampalli: కాంగ్రెస్ లో చేరిన సునీతా రెడ్డి దంపతులు

Serilingampalli: కాంగ్రెస్ లో చేరిన సునీతా రెడ్డి దంపతులు

జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో..

శేరిలింగంపల్లి పురపాలక సంఘం పరిధిలోని 28వ వార్డు చందానగర్ మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చందానగర్ లోని జవహర్ నగర్ కాలనీలో గల సునీత ప్రభాకర్ రెడ్డి స్వగృహంలో, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంపతులు ఇద్దరికీ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీత ప్రభాకర్ రెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి శాసనసభ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా తుడుచుకు పోయిందని గుర్తు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో సేవ చేసి ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సునీత దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షనీయమని జగదీష్ ప్రశంసించారు.

- Advertisement -

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన సునీత దంపతులను కోరారు. అంతకుముందు మాజీ కౌన్సిలర్ సునీత పత్రికల వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పట్ల మంచి అభిప్రాయం ఉండడం వల్లే రాజకీయాల్లో తిరిగి చేరామన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చామని చెప్పారు. శేషజీవితం గడపాలనుకున్న తమకు జగదీశ్వర్ గౌడ్ వ్యక్తిత్వం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే విధంగా చేసిందని సునీత ప్రభాకర్ రెడ్డి చెప్పారు. పార్టీ విజయానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని సునీత విలేకరులకు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News