Thursday, September 19, 2024
Homeనేషనల్Tripura: బీజేపీ అంటే గంగా నది.. రండి మీ పాపాలు కడుక్కోండి

Tripura: బీజేపీ అంటే గంగా నది.. రండి మీ పాపాలు కడుక్కోండి

త్రిపుర సీఎం మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ అంటే ఓ పవిత్ర గంగానది వంటిదని, గంగలో మునకేస్తే అన్ని పాపాలు నశించినట్టే బీజేపీలో చేరితే పాపాలన్నీ కడుక్కోవచ్చంటూ మాణిక్ సాహా పేర్కొన్నారు. తాము చేసిన పాపాలు వామపక్షాలు కడుక్కోవాలని అందుకు మార్గం బీజేపీలో చేరటమేనంటూ సీఎం అన్నారు. త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా సీఎం ఇలా మాట్లాడటం విపక్షాలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. కాక్రాబన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభ అయిన జన్ విశ్వాస్ ర్యాలీలో పాల్గొన్న మాణిక్.. మరోసారి తామే త్రిపురలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను విశ్వసించేవారంతా పవిత్ర గంగా నది వంటి బీజేపీలో చేరాలంటూ ఆయన పిలుపునిచ్చారు. త్రిపురలో లెఫ్ట్ పార్టీల హయాంలో సౌత్ త్రిపుర జిలాల్లో కనీసం 69 మంది ప్రతిపక్ష నేతల హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News