Sunday, October 6, 2024
Homeనేషనల్BJY: పాండవులు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేశారా? RSS-21 శతాబ్దపు కౌరవులు

BJY: పాండవులు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేశారా? RSS-21 శతాబ్దపు కౌరవులు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ ను 21వ శతాబ్దపు కౌరవులుగా ఆయన అభివర్ణించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హర్యానాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ తన మాటలకు పదును పెట్టి మాట్లాడుతున్నారు. “కౌరవులంటే ఎవరంటే 21వ శతాబ్దపు కౌరవులు ఖాకీ నిక్కర్లు వేసుకుంటారని, చేతిలో లాఠీ పట్టుకుని ఉంటారని, ఇద్దరు ముగ్గురు బిలియనీర్స్ వారికి అండగా ఉంటారు. పాండవులు నోట్ల రద్దు చేశారా, జీఎస్టీ అమలు చేశారా.. వాళ్లు అలా ఎన్నటికీ చేయరు ఎందుకంటే వారు తపస్వులు” అంటూ రాహుల్ ప్రసంగం సాగింది. మహాభారత యుద్ధం జరిగిన హర్యానా నేలపై రాహుల్ గాంధీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News