Saturday, April 12, 2025
HomeఆటChegunta: రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు చేగుంట విద్యార్థులు

Chegunta: రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు చేగుంట విద్యార్థులు

10 మంది క్రీడాకారులు ఎంపిక

చేగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో ఈ నెల 7 వ తేదీన జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 టచ్ రగ్బీ టోర్నమెంట్ లో చేగుంట పట్టణానికి చెందిన 10 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని కొచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన వారిలో బాలికల విభాగంలో లాస్య, కావ్య, వంశీకృష్ణ, మణికంఠ, రాకేష్, హర్షవర్ధన్ ఆదర్శ పాఠశాలకు చెందినవారు కాగా, గాయత్రి, దివ్య, నరేష్ జిల్లా పరిషత్ హై స్కూల్, రాణీకుమారి శ్రీకృష్ణవేని స్కూల్ కు చెందిన వారని ఆయన తెలిపారు. వీరి ఎంపిక పట్ల ఆదర్శ హై స్కూల్, శ్రీకృష్ణవేణి టాలెంట్ ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి, నీరజ, వివేక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి వెంకటేష్, పి.ఈ.టి బాలరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News