Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు ముసుగు తొలగించరా?

Garla: ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు ముసుగు తొలగించరా?

ముసుగు తొలగించమంటున్న ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గార్ల మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దేశ, రాష్ట్ర నాయకుల విగ్రహాలకు పార్టీ దిమ్మలకు గుర్తులకు ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం ముసుగు వేయడం ఆనవాయితీ. గతనెల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గార్ల మండల వ్యాప్తంగా ఉన్న దేశ రాష్ట్ర నాయకుల విగ్రహాలకు వివిధ పార్టీల దిమ్మలకు గుర్తులకు ముసుగు వేశారు.

- Advertisement -

ఎన్నికలు జరిగి ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీ రామారావు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఎన్నికల కోడ్ లో వేసిన ముసుగు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులకి తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దేశ రాష్ట్ర నాయకుల విగ్రహాలకు ముసుగులు తొలగించాలని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News