Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Garla: గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

డిమాండ్లు తీరేవరకు సమ్మె

నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ సేవక్స్, ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట మంగళవారం తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిడిఎస్ ల డిమాండ్లలో ముఖ్యంగా తమ పని వేళలను 8 గంటలకు నిర్ణయించాలని, పెన్షన్ తో పాటు అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని, టిఆర్సీఏ రేషనల్ ఫిక్సేషన్ సహా కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రెగ్యులర్ ఎంప్లాయిస్ కు ఇచ్చినట్లు వెయిటేజి, ఇంక్రిమెంట్స్ సీనియర్స్ కు ఇవ్వాలనీ, 12, 24, 36 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలి.గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షల పెంచాలని,డిపార్ట్ మెంట్ స్టాప్ తో సమానంగా జిడీఎస్ లకు గ్రాట్యూవిటీ పెంచాలి.పెయిడ్ లీవ్స్ 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకొనే సౌకర్యం కల్పించాలని,జీడీఎస్ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ 3% నుండి 10% కు పెంచి రిటైర్డ్ జీడీఎస్ లకు హడాక్ పెన్షన్ మంజూరు చేయాలని, ఇన్ సెంటివ్స్ /కమీషన్ పద్ధతులు రద్దు చేసి ప్రతీ పనిని వర్క్ లోడ్ లోకి తీసుకోవాలి అని అన్నారు.

- Advertisement -

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీడీఎస్ ల 5 గంటల పనికి సెకండ్ టి.ఆర్,సి.ఎ ఇవ్వాలి అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. బిజినెస్ టార్గెట్ ల పేరుతో జీడీఎస్ లను వేదించే పద్దతులను సొంత మొబైల్ ఫోన్ లను ఉపయోగించాలనే ఒత్తిడిని ఆపివేయాలి. ఫేస్ బుక్ ,ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా స్లాట్ ఫారంలను అనుసరించాలని బలవంత పెట్టకూడదు అని అన్నారు.
సేవలను విసృతం చేయడానికి సత్వరంగా అందించడానికి ఆర్ ఐసిటి డివైజ్ లను ఉపసంహరించి ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు బ్రాంచ్ పోస్టాఫీసులకు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. లేకపోతే నిరవధిక సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తపాల ఉద్యోగులు జమీల, అరుణ్ కుమార్, చంద్రశేఖర్, సురేష్, ప్రవీణ్, నవీన్, బాలరాజు, మణికంఠ, ప్రకాష్, మహేష్, రేణుక, అనూష, కవిత, వేణు, ముజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News