Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Legislature: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలు చర్చించడం చట్టసభల బాధ్యత

Legislature: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలు చర్చించడం చట్టసభల బాధ్యత

అహంకారం, ఆధిపత్యానికి తావు లేకుండా సభ జరగాలి

పార్లమెంట్‌ అనే పదం లాటిన్‌ పదం పార్లమెంటం నుండి ఉద్భవించింది, ఇది మొదట సన్యాసుల మధ్య సంభాషణలకు తరువాత దౌత్య సమావేశాలకు వర్తించ బడుతుంది. ఫ్రెంచ్‌ క్రియాపదం పార్లర్‌ అంటే మాట్లాడటం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది పార్లమెంటు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రాథమిక సాధనం. ప్రభుత్వాన్ని పర్యవేక్షించే పనిలో శాసనసభ మూడు ముఖ్యమైన పాత్రలను నిర్వహిస్తుంది: శాసన పాత్ర, ఆర్థిక పాత్ర, విచారణ పాత్ర.

- Advertisement -

శాసన పాత్ర: చట్టాల ఆమోదం అనేది శాసనసభకు సాధారణంగా ఆపాదించబడిన విధి. మన ప్రావిన్స్‌ చట్టబద్ధమైన పాలనలో ఉన్నందున, అసెం బ్లీలో ప్రవేశపెట్టిన ప్రతి శాస నాన్ని సమర్థవంతంగా పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. శాసన ప్రక్రి యను అర్థం చేసుకోవడానికి, పదజాలం ముఖ్యం. అసెంబ్లీ పరిశీలనలో ఉన్న చట్టా న్ని బిల్లు అంటారు. బిల్లు ఆమోదించబడిన తర్వాత, అది చట్టం లేదా శాసనం అవుతుంది. బిల్లు యొక్క దశలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు చట్టంగా మారడానికి కింది దశలను దాటాలి. బిల్లు ఒక వివరణాత్మక పరిశీలన కోసం స్టాండింగ్‌ కమిటీ లేదా మొత్తం బిల్లుల కమిటీకి సూచించబడుతుంది. క్లాజు వారీగా బిల్లును పరిశీలించే ముందు పబ్లిక్‌ హియరింగ్‌లు నిర్వహించ వచ్చు. బిల్లును తిరిగి అసెంబ్లీకి నివేదించే ముందు సవరణలు కూడా ప్రతిపాదించవచ్చు.సభ్యులు బిల్లుపై ఓటింగ్‌ చేయడానికి ముందు చివరిసారిగా చర్చించవచ్చు.

ఆర్థిక పాత్ర: ప్రతి సంవత్సరం ఆర్థిక మంత్రి శాసనసభకు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. ప్రతి మంత్రి బడ్జెట్‌ను సభ్యులు వివరంగా సమీక్షించేందుకు వీలుగా ప్రతి మంత్రిత్వశాఖ, ఏజెన్సీకి అంచనా వ్యయంపై అంచనాలు సమర్పించబడతాయి. ఈ ప్రక్రియ ప్రధానంగా పాలసీ ఫీల్డ్‌ మరియు హౌస్‌ కమిటీలలో జరుగుతుంది అభ్యర్థించిన నిధులను మంజూరు చేయడానికి ముందు కమిటీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి, అతని/ఆమె అధికారులు ప్రతిస్పందిస్తారు. ప్రీమియర్‌ బాధ్యత వహించే కార్యనిర్వాహక మండలి అంచనాలు ఆర్థిక కమిటీలో పరిగణించబడతాయి. అభ్యర్థించిన మొత్తాలను తిరస్కరించడానికి లేదా బడ్జెట్‌ను తనకు తగినట్లుగా తగ్గించడానికి అసెంబ్లీకి హక్కు ఉంది. ఈ ప్రక్రియను సరఫరాకు ముందు ఫిర్యాదు అని పిలుస్తారు పర్సు స్ట్రింగ్‌ల నియంత్రణ రాజు నుండి తీసివేయబడినప్పుడు పార్లమెంటు ప్రారంభం నాటిది. అసెంబ్లీ దాని కమిటీలు అంచనాల పరిశీలనను ముగించిన తర్వాత, ఆమోదించబడిన నిధులను మంజూరు చేయడానికి ఒక విభజన బిల్లును ప్రవేశపెడతారు. మధ్యంతర సరఫరా బిల్లులను ఆమోదించడం ద్వారా అసెంబ్లీ తాత్కాలిక ఆర్థిక సాయాన్ని అనుమతిస్తే తప్ప, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ ఆర్థిక పాత్రలో ఖర్చుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. నిధులు ఆమోదించబడిన తర్వాత, ఆడిట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపులో, ప్రభుత్వం పబ్లిక్‌ అకౌంట్లను తప్పనిసరిగా టేబుల్‌ చేయాలి. పుస్తకాల యొక్క సభ్యుల సమీక్షకు అధికారిక నివేదికలను జారీ చేసే అసెంబ్లీ అధికారి, ప్రావిన్షియల్‌ ఆడిటర్‌ సహాయం చేస్తారు. ఈ ప్రచురణలన్నీ పబ్లిక్‌ అకౌంట్స్‌పై స్టాండింగ్‌ కమిటీకి సూచించ బడతాయి, ఇది ఖర్చులు సరైన శాసన అధికారంతో, ఖర్చు చేసిన డబ్బుకు విలువతో చేశారో లేదో నిర్ణయిస్తుంది. క్రౌన్‌, సెంట్రల్‌ ఏజెన్సీలపై స్టాండింగ్‌ కమిటీ సస్కట్చేవాన్‌ యొక్క క్రౌన్‌ కార్పొ రేషన్ల కార్యకలాపాలపై ఇదే విధమైన సమీక్షను నిర్వహిస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాలను సమర్ధవంతంగా పరిశీలించాలంటే, శాసన సభ సమాచారాన్ని కోరే అవకాశం ఉం డాలి. సభ్యులు ప్రశ్నలను అడిగే సామర్థ్యం ప్రావిన్స్‌కు ముఖ్యమైన అనేక సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. సభ్యులు సమాచారాన్ని పొందగల రెండు సాధారణ మార్గాలు ఏమిటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్న అడగడం లేదా అసెంబ్లీకి నిర్దిష్ట సమాచారాన్ని తిరిగి ఇవ్వమని అభ్యర్థిస్తూ రిటర్న్‌ కోసం మోషన్‌ను తరలించడం.

ప్రశ్నాకాలం: ఇది బహుశా అసెంబ్లీ విచారణ ప్రక్రియలన్నింటిలో బాగా తెలిసినది. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ప్పుడు ప్రతి రోజు 25 నిమిషాల పాటు, సభ్యులు ఆ మంత్రి బాధ్యతలో ఏదైనా అంశంపై క్యాబినెట్‌ మంత్రికి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది.

వ్రాతపూర్వక ప్రశ్నలు: సభ్యులు వ్రాతపూర్వక ప్రశ్నలను కూడా మంత్రికి పంపవచ్చు, అతను ఐదు సిట్టింగ్‌ రోజులలోపు నేరుగా సమాధానం ఇవ్వడానికి లేదా ప్రశ్నను రిటర్న్‌గా మార్చడానికి అవకాశం ఉంది. సాధారణ సమయ పరిమితిలోపు సిద్ధం చేయడానికి ప్రతిస్పందన చాలా వివరంగా ఉన్నప్పుడు రిటర్న్‌ అవసరం. వివాదాస్పద ప్రశ్న సాధారణంగా రిటర్న్‌ కోసం మోషన్‌గా మార్చబడుతుంది, దీనిని చర్చించవచ్చు మరియు సవరించవచ్చు.

కమిటీ సమీక్ష: సభ్యులు తరచుగా సంక్లిష్ట సమస్యలతో వ్యవ హరించాలి, అవి మంచి పరిశీలన అవసరం. అనేక సందర్భాల్లో, మొత్తం అసెంబ్లీ దృష్టిని డిమాండ్‌ చేసే కొన్ని ముఖ్యమైన విషయాలను సరిగ్గా ఎదుర్కోవటానికి సమయం లేదు. అసెంబ్లీ ఒక నిర్ణయానికి రాకముందే సభ్యులకు వివరణాత్మక పరిశోధనలు చేసేందుకు శాసన కమిటీలు అనుమతిస్తాయి. కమిటీలు సభ్యులకు వివరణాత్మక విచారణను కొనసాగించే అవకాశాన్ని కల్పిస్తాయి మరియు సభ్యుల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మంత్రులు తమ శాఖ అధికారులను గదిలోకి తీసుకురావడానికి అనుమతిస్తాయి. బిల్లులు, అంచనాలను సమీక్షించే వారి సాధారణ పనితో పాటు, కమిటీలు అసెంబ్లీ నియమాలను సమీక్షించడం లేదా శక్తి ఎంపికలు లేదా పొగాకు నియంత్రణ వంటి నిర్దిష్ట సమస్యలను పరిశీలించడం వంటి ప్రత్యేక పనులను చేపడతాయి. శాసనసభ సెషన్‌లో మరియు సెషన్‌ల మధ్య అవసరమైన విధంగా సమావేశాలు షెడ్యూల్‌ చేయబడతాయి. అన్ని కమిటీలు తమ ఫలితాలను అసెంబ్లీకి నివేదిస్తాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రజాధనంతో నిర్వహించబడే బాధ్యతాయుతమైన పాలనకు ప్రతిరూపాలు. ఎక్కువ పని దినాలు నిర్వహించడం ఎంత ముఖ్యమో బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల మీద చర్చించడం కూడా అంతే ముఖ్యం. కానీ అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో పార్లమెంట్‌తో సహా అనేక రాష్ట్రాలలోని చట్ట సభలు తమ పని దినాలను తగ్గించుకోవడమే కాకుండా ప్రతి పక్షాల చర్చలకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక తప్పించుకో చూసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10ఏళ్ల కాలంలో పని దినాల సంఖ్య కూడా తగ్గడమే కాకుండా బలమైన ప్రతిపక్షాలను లేకుండా చేసి ఏకస్వామ్య పాలన కొనసాగించిన తీరు, అసెంబ్లీలో చర్చకు తావులేని సందర్భాలు మనమందరం చూసి ఉన్నాము. కానీ దానికి భిన్నంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం అవతరించిన తర్వాత జరిగిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన జరిగిన ఒకటి రెండు రోజుల చర్చల్లోనూ, రెండు రోజుల వ్యవధి తర్వాత ఆర్థిక పరిస్థితిపైన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలోనూ అసెంబ్లీలో జరిగిన చర్చ వాదోపవాదాలు, విమర్శలు, బెదిరింపులు దిగజారిన రాజకీయానికి గుర్తుగా మనం భావించవలసి ఉంటుంది. ఓటమి తర్వాత కూడా తమకు అధికార పార్టీ కంటే కేవలం 25 సీట్లు మాత్రమే తక్కువ వచ్చినట్లు కాంగ్రెస్‌ 64 సీట్లతో అధికారంలో కొనసాగడాన్ని సహించని బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభ్యులు ముఖ్యంగా హరీష్‌ రావు కేటీఆర్‌ ఇతరులు అధికార పార్టీ ప్రకటించిన గత పాలనలోని ఆర్థిక అరాచకత్వాన్ని సహించడానికి సిద్ధంగా లేక రెచ్చిపోయిన సందర్భాలను మనం గమనించవచ్చు. గవర్నర్‌ ప్రసంగాన్ని, ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టి నటువంటి లఘు చర్చ నివేదికను కూడా తప్పుల తడకగా అభివర్ణించడం బీఆర్‌ఎస్‌ పార్టీకే చెల్లింది. తమ పరిపాలనా కాలంలో అనుత్పాదకరంగం మీద ఖర్చు చేసి అప్పులు పెంచి నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నాణ్యత ప్రమాణాల లోపాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ అంగీకరించడానికి సిద్ధపడకపోవడం పైగా అధికార పార్టీని ఆర్థిక నివేదికను తప్పుపట్టే ప్రయత్నం చేయడం ఆడలేక మద్దెల ఓడింది అన్నట్లుగా మనకు కనిపిస్తున్నది. తమకు శాసన సభ్యత్వంలో అనుభవం ఎక్కువగా ఉన్నదని, తామే పాలనా దక్షులమని, వక్తలమని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలకు పరిపాలన సాధ్యం కాదని అవగాహన లేదని మాటల్లో కాకపోయినా చేతల్లో హేళన చేసే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉన్నది. కానీ పది సంవత్సరాల పరిపాలన తీరు, చేసిన అప్పులు, ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక విధ్వంసం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల లోటు, కనీసం ఉద్యోగులకు కూడా వేత నాలు సకాలంలో చెల్లించలేని దుస్థితిని విమర్శించినప్పుడు తట్టు కోలేకపోవడం పరోక్షంగా వైఫల్యాన్ని ఓటమిని అంగీకరించడమే అవుతుంది. స్పీకర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల స్థానాలను, చట్ట సభలను గౌరవించడానికి సిద్ధంగా లేని ఆదిపత్య ధోరణినీ ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మాట్లాడిన నాయకులలో చూడవచ్చు. కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలు గత పాలనా కాలంలోనే వైఫల్యాలను సమీక్షించిన అధికారులు విషయాలను దాచిపెట్టినట్లు నిర్మాణం చేసిన కంపెనీ ఎల్‌ అండ్‌ టి ఎన్నికల సమయంలో పునర్నిర్మించడానికి సిద్ధమని ప్రకటించి నట్టు పత్రికల్లో చూసి ఉన్నాము. కానీ ప్రస్తుతము ఒప్పందం ముగిసిపోయిందని తమకేమీ సంబంధం లేదని ఎల్‌ అండ్‌ టీ కథ నాలు రావడం వెనుక బీఆర్‌ఎస్‌ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నట్లుగా శాసనసభలో వారి మాటలను బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా అన్ని నిర్మాణాలతో పాటు ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల మేడిగడ్డ అన్నారం బ్యారేజీలలో కనిపిస్తున్నటువంటి వైఫల్యాలను సుదీర్ఘంగా చర్చించి సిట్టింగ్‌ జడ్జ్‌ లేక ఇతరత్రా వేదికల ద్వారా విచారణకు ఆదేశించడం ద్వారా గత ప్రభుత్వం యొక్క అవినీతిని బట్టబయలు చేయవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది. ఈ విషయంలో ప్రతిపక్షం కూడా మాట వరసకు సహకరిస్తామని చెప్పడం వెనుక ఉన్న రహస్యం విచారణ తర్వాత కానీ తెలియరాదు. ఆర్థిక చర్చ గత పాలకుల వైఫల్యాన్ని ప్రజలకు తెలియచెప్ప డానికి ఎంతో దోహదపడుతుంది. రాష్ట్ర విభజననాడు 64 వేల కోట్ల రూపాయల మిగులుతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ పరిపాలన కాలంలో మద్యం ద్వారా తన ఆదాయాన్ని పదివేల కోట్ల నుండి సుమారు 40 వేల కోట్లకు పెంచుకోవడం ద్వారా అధిక ఆదాయాన్ని సమకూర్చుకున్నప్పటికీ ప్రభుత్వ భూములు అమ్మడం, భూ కబ్జాలకు పాల్పడడం, అన్నింట్లో అవినీతిలో ప్రభుత్వం భాగస్వామి అయినట్లు ఇటీవల ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శనాస్త్రాలను బట్టి తెలు స్తుంది. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం సరైన సమాధానం చెప్ప కుండా దాటవేసి అప్పులు పెరిగినప్పటికీ ఆస్తులు కూడా పెరిగినవి కదా వాటి గురించి ప్రస్తావించడం లేదు అని మాట్లాడుతూనే 50 కోట్ల రూపాయలతో రేవంత్‌ రెడ్డి తెలంగాణ పిసిసి చీఫ్‌గా ఎన్ని కైనడని హరీష్‌ రావు చేసినటువంటి ప్రకటన పెను వివాదానికి విమర్శకు దారి తీసినది. స్పీకర్‌ విమర్శను వాపస్‌ తీసుకోమని ఆదేశించడం, శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ అనేకమంది మంత్రులు శాసనసభ్యులు అధికార పార్టీ వాళ్లు హరీష్‌ రావును నిలదీయడం జరిగింది. రాజగోపాల్‌ రావు చేసిన వ్యాఖ్యకు బదులుగా విమర్శ చేశానని హరీష్‌ రావు చెప్పడం సంబంధం లేని ముఖ్యమంత్రిని వివాదములోకి లాగడం హరీష్‌ రావు యొక్క అసంబద్ధ విధానం కాక మరేమవుతుంది? అందుకే మంత్రులందరు ముప్పేట దాడి చేసి నోరు మూయించిన విషయాన్ని కూడా మనం అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో గమనించవచ్చు. ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే ఐదేళ్ల కోసం పరిపాలన చేసే క్రమంలో గత పాలకుల యొక్క వైఫల్యాలను ఆర్థిక దుస్థితిని ప్రజలకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపడానికి ప్రత్యక్షంగా టీవీల ద్వారా చట్టసభల ప్రసారాలు ఎంతో దోహదపడతాయని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే టీవీల ముందు లేనటువంటి అనేక మంది సామాన్యులు కూడా తమ సెల్‌ ఫోన్ల ద్వారా యూట్యూబ్‌ ఛానల్‌లో చట్టసభల చర్చలను వినడాన్ని బట్టి గమనిస్తే ప్రజలు అసెంబ్లీ సమావేశాల ప్రసారాల పట్ల ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అధికారానికి వచ్చి కనీసం పది రోజులు కూడా కాకముందే అధికారానికి వచ్చిన ఒకటి రెండు రోజులలో ప్రభుత్వాన్ని విమర్శించడం, గ్యారంటీలను అమలు చేస్తారా లేదా అని ఆదేశించడం, నమ్మకం లేదు అని అసహనాన్ని వ్యక్తం చేయడం, గ్యారెంటీలను అమలు చేయడానికి మీకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? అని చట్టసభలో ప్రశ్నించడం బట్టి చూస్తే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014లో ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను పదేళ్ల తర్వాత కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను గమనించినప్పుడు ఈ పార్టీ శాసనసభ్యులకు నిన్న మొన్ననే అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అర్హత ఎక్కడిది? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడినటువంటి టిఆర్‌ఎస్‌ శ్రేణులు నాయకులు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి జారుకోవడం అత్యంత విచారకరం. ఇదంతా అధికారం కోల్పోయి, ప్రతిపక్షంలో కూర్చుని, ఇతరుల నాయకత్వాన్ని అధికారాన్ని గుర్తించడానికి గౌరవించడానికి సిద్ధంగా లేనటువంటి కుసంస్కారానికి నిదర్శనంగా మనం భావించవలసి ఉంటుంది. అయితే ఈ రకమైనటువంటి వాడి వేడి చర్చలు గత సభలో లేకపోవడాన్ని మనం గమనిస్తే ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేసి చర్చకు తావు లేకుండా చేసినారో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షం బలంగా ఉండడం అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది నిజమైనటువంటి ప్రభుత్వ పని విధానానికి సూచికగా ప్రతిపక్షం యొక్క బలాన్ని అంచనా వేయవచ్చు. చర్చలు ప్రశ్నలు ఎంత విస్తరించినా అభ్యంతరం లేదు కానీ చట్టసభల హుందాతనాన్ని పదవిలో కొనసాగుతున్న వారి గౌరవాన్ని కాపాడకపోయినట్లయితేనే అది అహంకారానికి, అమ ర్యాదకు, ఆత్మవంచనకు దారితీస్తుంది అని ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తిస్తే మంచిది. ఇక ఒకటి రెండు పార్టీల సభ్యులు 57 ఏళ్లలో జరిగనటువంటి అభివృద్ధి కేవలం పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని బీఆర్‌ఎస్‌ పార్టీని మెచ్చుకోవడం ప్రశంసించడం ఏ రకంగా సబబో అర్థం కాదు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 35 సంవత్సరాల పాటు మాత్రమే కాంగ్రెస్‌ పరిపాలన చేసింది. ఇతర కాలమంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఇక గమ్మత్తయిన విషయం ఏమిటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమే పరిపాలన చేసింది అలాంటప్పుడు ఇతర పార్టీల గురించి ప్రశ్నించే ఆస్కారమే లేదు. ఇక తెలంగాణ రాష్ట్రం అచ్చమైన తెలుగు రాష్ట్రం. పరిపాలన, చట్టసభల నిర్వహణ, వెలువడే ఉత్తర్వులు అన్నీ కూడా తెలుగు భాషలో కొనసాగాలని అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు డిమాండ్లు వస్తున్నప్పటికీ ఈ చట్టసభలో మాత్రం ఆంగ్లంలో మాట్లాడడానికి పోటీ పడడం సభ్యుల అవగాహనతో సంబంధం లేకుండా భాషను ప్రయోగించి వ్యక్తిగత ప్రాబల్యాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం కూడా తెలుగు భాషను చట్టసభల హుందాతనాన్ని అవమానించడమే అవుతుంది. కచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంలో ప్రతి సభ్యుడు కూడా విధిగా తెలుగులోనే మాట్లాడాలని తద్వారా ప్రసారాలను చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని స్పీకర్‌ ఆదేశించడం ద్వారా తెలుగు భాషను పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రయత్నం జరగాలి. చర్చలను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకం కూడా చింత చచ్చినా పులుపు ఇంకా చావలేదని, ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు కసి అహంకారం నిజాలను జీర్ణించుకోలేకపోవడం అలవాటుగా మారిందని ప్రజలు గుసగుసలు పెట్టుకోవడాన్ని గమనిస్తే అధికార పార్టీతో సహా అన్ని విపక్ష సభ్యులు కూడా ప్రజల ముందు చాలా జాగ్రత్తగా మర్యాదగా హుందాతనంగా ప్రజల భాషలో ప్రజా కోణంలో ప్రజా సమస్యలపైనే మాట్లాడడం ద్వారా చట్టసభలకు గౌరవాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుందాం. అహంకారం, ఆధిపత్యానికి తావు లేకుండా మానవీయ కోణంలో గౌరవ మర్యాదలతో సభలు కొనసాగాలని ఆశిద్దాం.

– డాక్టర్‌. రక్కిరెడ్డి ఆదిరెడ్డి కాకతీయ యూనివర్సిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News