Sunday, October 6, 2024
HomeదైవంMahanandi: మహానందిలో ప్రదోషకాల నందీశ్వర అభిషేకం

Mahanandi: మహానందిలో ప్రదోషకాల నందీశ్వర అభిషేకం

మార్గశిర బహుళ త్రయోదశి రోజున..

మహానంది క్షేత్రంలో వైభవంగా ప్రదోషకాల నందీశ్వరాభిషేకం నిర్వహించారు. మార్గశిర బహుళ త్రయోదశి శివ ప్రదోషం సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సుధా కుమారి దంపతులచే ఆలయ వేద పండితులు మరియు అర్చకులు ద్వారపాలకపూజ, పీఠార్చన, పంచామృతాభిషేకం, వివిధ చూర్ణాభిషేకము, నందీశ్వరార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బండి హేమలత,గంగోత్రికి చెందిన నాగసాధు నాగవ సత్యనారాయణ స్వామిజీ,దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News