Friday, September 20, 2024
HomeదైవంSrisailam Revenue increasing: శ్రీశైల ఆదాయం 5 కోట్లు@28 రోజుల్లో

Srisailam Revenue increasing: శ్రీశైల ఆదాయం 5 కోట్లు@28 రోజుల్లో

భారీగా పెరిగిన మల్లన్న ఆదాయం

శ్రీశైల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. తాజాగా కేవలం 28 రోజుల్లో 5 కోట్లకుపైగా మల్లన్నకు ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపులో దేవస్థానానికి రూ.4,83,53,238/- నగదు రాబడిగా లభించింది.
కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (13.12.2023 నుండి 09.01.2024వరకు) సమర్పించారు. ఈ హుండీలో 133 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 11 కేజీల 850 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 1751- యుఎస్ఏ డాలర్లు 90 సౌత్ ఆఫ్రికా రాండ్స్, 14.25 – కువైట్ దినార్స్, 15- ఓమన్ రియాల్స్, 450 – యూఏఈ దిర్హమ్స్, 40 – కెనడా డాలర్లు. 28 – సింగపూర్, 100- ఆస్ట్రేలియా డాలర్లు, 10 – ఈరోస్, 5- కత్తార్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు ధర్మకర్తల మండలి సభ్యులు ఎం. విజయలక్ష్మీ ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News